కావలసినవి : కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు ( బాగా చిలకాలి ), శనగపిండి - 2 టీ స్పూన్లు , కొబ్బరి తురుము - టీ స్పూను...
కావలసినవి :
కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు - రెండు కప్పులు(బాగా చిలకాలి), శనగపిండి - 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము - టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, కొత్తిమీర తరుగు - రెండు టీ స్పూన్లు, పసుపు- అర టీ స్పూను, పకోడీల కోసం: శనగపిండి -పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూను, కొత్తిమీర- చిన్న కట్ట, తినే సోడా - చిటికెడు, పసుపు- కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, పోపు కోసం: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 1 (కట్ చేయాలి), జీలకర్ర- అర టీ స్పూను, ఆవాలు- అర టీ స్పూను, కరివేపాకు- రెండు రెమ్మలుతయారి :
ఒక పాత్రలో శనగపిండి, పచ్చిమిర్చి, కత్తిమీర, సోడా, పసుపు, ఉప్పు వేసి తగినంత నీరు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె కాగాక ఈ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించి గోధుమరంగులోకి వచ్చాక తీసి పక్కన ఉంచాలి. ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి. ఒక చిన్న గిన్నెలో రెండు కప్పుల నీరు, శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి వడగట్టాలి. వేయించిన కొబ్బరితురుము, అల్లంవెల్లుల్లి పేస్ట్ జతచేసి కలిపి స్టౌ మీద ఉంచి మరిగించాలి. మంట తగ్గించి ఐదు నిముషాలు ఉంచితే పులుసు రెడీ అవుతుంది. బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి జతచేసి ఒకసారి వేయించాక, మరిగిన పులుసులో వేయాలి. తయారుచేసి ఉంచుకున్న పకోడీల ను పులుసులో వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి.
COMMENTS